అధిక బరువు వేధిస్తుంటే.. ఈ చిట్కాను పాటించండి..

ఆదివారం, 20 మే 2018 (12:42 IST)
అధిక బరువు వేధిస్తుందా...? వ్యాయామాలు, డైట్ ఫాలో చేసినా ఫలితం లేదా? అయితే ఈ చిన్ని చిట్కాను పాటిస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. లావుగా ఉన్న స్త్రీ పురుషులు, ప్ర‌తీ రోజు ఉద‌యాన్నే లేచి ఎటువంటి వ్యాయామాలు చేయ‌కుండా, కేవ‌లం అలోవీరా జ్యూస్ తాగితే చాలు.. సులభంగా బరువు తగ్గిపోతారట. 
 
ఈ జ్యూస్ తాగాక ఫుల్‌గా నచ్చిన ఆహారాన్ని లాగించవచ్చునట. అలోవెరా జ్యూస్‌ను ప్ర‌తీరోజూ ఉద‌యాన్నే లేచి ప‌ర క‌డుపుతో తాగిన‌ట్లైతే.. బ‌రువు త‌గ్గే అవ‌కాశాలు ఎక్కువ‌గా వున్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలపై పోరాడుతాయి. 
 
కలబంద జ్యూస్‌‌లోని పోషకాలు మెదడు కణాలను బలంగా మారుస్తాయి. బ్రెయిన్‌ని యాక్టివ్‌గా ఉంచడంతో పాటు, అల్జీమర్స్ సమస్యలను దూరంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు