కిడ్నీ వ్యాధి వున్నవారికి కొబ్బరి నీరు తాగిస్తే?

గురువారం, 28 సెప్టెంబరు 2023 (17:39 IST)
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
 
అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
 
కొబ్బరి నీరు మూత్రాశయ సంబంధిత వ్యాధులలో గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. మధుమేహం ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లతో ఎంతో ప్రయోజనం పొందుతారు. రాత్రి భోజనం చేసిన తర్వాత అరగ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే నిద్రలేమి సమస్యను నయం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు