తెలంగాణలో తొలిసారిగా ఎథోస్ ఇంటిగ్రేటెడ్ అడాప్టివ్ రేడియోథెరపీ-SGRTతో రోగులకు చికిత్స: ఏఓఐ

ఐవీఆర్

శుక్రవారం, 8 మార్చి 2024 (23:05 IST)
తెలంగాణలో ఒక మార్గదర్శక చర్యలో భాగంగా, దక్షిణాసియాలోని అతిపెద్ద క్యాన్సర్ చైన్ ఆసుపత్రులలో ఒకటైన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ) ఇప్పుడు ఎథోస్, SGRTలను విజయవంతంగా ఉపయోగించి గర్భాశయ, ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులకు విజయవంతంగా చికిత్స అందించింది. అదేసమయంలో  అధునాతన క్యాన్సర్ సంరక్షణ పరిష్కారాలలో తమ నాయకత్వ స్థానం స్థిరీకరించుకుంది. ఏఓఐ హైదరాబాద్ ఇప్పుడు రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంది, ఇది మెరుగైన చికిత్సా ఫలితాలు, ఉన్నతమైన జీవన ప్రమాణాలకు దారి తీస్తుంది.
 
వేరియన్ యొక్క అత్యంత అధునాతన ఉపరితల మార్గదర్శక వ్యవస్థ, ఐడెంటిఫై సాంకేతికతతో అనుసంధానించబడిన AI- ఆధారిత సంపూర్ణ పరిష్కారం, ఎథోస్. ఖచ్చితమైన క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక పురోగతిని సూచిస్తుంది. SGRT సాంకేతికత అధునాతన 3D థర్మల్ కెమెరా సాంకేతికతను ఉపయోగిస్తుంది, రేడియోథెరపీ సెషన్‌లలో రోగి స్థానాలు, కదలికలను నిజ-సమయ పర్యవేక్షణ, ట్రాకింగ్‌ని ఎనేబుల్ చేస్తుంది. చుట్టుపక్కల ఆరోగ్యకరమైన కణజాలాలకు బహిర్గతం కాకుండా కణితికి రేడియేషన్ యొక్క ఖచ్చితమైన డెలివరీని నిర్ధారిస్తుంది. అడాప్టివ్ ఎథోస్ రేడియోథెరపీతో SGRTని ఏకీకృతం చేయడం ద్వారా, చికిత్స ఖచ్చితత్వం, సమర్థతను ఏఐఓ పెంచుతుంది, ఫలితంగా మెరుగైన ఫలితాలు సాధ్యం కావటంతో పాటుగా క్యాన్సర్ రోగులకు దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి.
 
ఏఐఓ యొక్క రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి, ఈ మైలురాయి గురించి తమ సంతోషం  వ్యక్తం చేస్తూ "ఇటీవలి సంవత్సరాలలో రేడియోథెరపీ సాంకేతికత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది, భారతీయ రేడియోథెరపీ మార్కెట్ 2022లో $126 మిలియన్ల నుండి 2030 నాటికి 9 శాతం CAGR వద్ద, $250 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించడం ద్వారా, రేడియోథెరపీలో పురోగతి లభ్యత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. చికిత్స ఖచ్చితత్వాన్ని ఏఐ మెరుగుపరుస్తుంది, దుష్ప్రభావాలను తగ్గించగలదు. ఏఐ-ఆధారిత చికిత్స ప్రణాళిక, ఖచ్చితమైన మోతాదు గణన, నిజ-సమయ కణితి ట్రాకింగ్ ద్వారా వనరుల పంపిణీని మెరుగు పరుస్తుంది. ఏఓఐ వద్ద మేము, తెలంగాణలోని రోగులకు ఉత్తమ ఫలితం, జీవన నాణ్యతను నిర్ధారించడానికి రెండు సాంకేతికతలను కలిపిన తొలి సంస్థగా ఉన్నాము. SGRTని అడాప్టివ్ ఎథోస్ రేడియోథెరపీతో అనుసంధానించడం క్యాన్సర్ చికిత్సలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది" అని అన్నారు.
 
ఏఓఐ హైదరాబాద్‌లోని రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీత రెడ్డి, రోగులకు ఈ ఏకీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడిస్తూ, "సర్ఫేస్ గైడెడ్ రేడియేషన్ థెరపీ (SGRT)ను ఒక మంచి ఇమేజింగ్ టెక్నిక్‌గా అంగీకరించటంతో పాటుగా గుర్తించటం దాని ఇటీవలి రేడియేషన్ ఆంకాలజీ సౌకర్యాల ఇన్‌స్టాలేషన్‌కు మద్దతునిచ్చింది. SGRT, ఎథోస్ యొక్క ఏకీకరణ రేడియేషన్ థెరపీలో మార్గదర్శక పురోగతిని సూచిస్తుంది, ఖచ్చితమైన చికిత్సా పద్ధతుల యొక్క భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది. అడాప్టివ్ AI-ఆధారిత సాంకేతికతతో మేము రేడియేషన్ థెరపీని విప్లవాత్మకంగా మార్చడంలో ముందంజలో ఉన్నాము. మేము రోగులకు  మెరుగైన చికిత్సా అనుభవం అందిస్తున్నాము, వారి దైనందిన జీవితాలకు అంతరాయాలను తగ్గించడం చేస్తున్నాము. కణితులను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవడం, ఆరోగ్యకరమైన కణజాలాలకు రేడియోధార్మికత గురికావడాన్ని తగ్గించడం ద్వారా, రోగులు తక్కువ దుష్ప్రభావాలను అనుభవిస్తారు, చికిత్స సమయంలో, తర్వాత మెరుగైన జీవన నాణ్యతకు అవకాశమిస్తుంది. తగ్గిన చికిత్స సమయాలు కూడా రోగులు తక్కువ ఖర్చు చేయడానికి అనుమతిస్తాయి. మంచం మీద తక్కువ సమయం ఉండటం వలన చికిత్స సమయంలో కదలికను తగ్గిస్తుంది" అని అన్నారు.
 
రోగి స్థానం పరంగా, SGRT అనేది మొత్తం చికిత్స సమయాన్ని తగ్గించడానికి, ఇమేజింగ్ మోతాదును తగ్గించడానికి సమర్థవంతమైన సాధనం. ఇది రోగి యొక్క పూర్తి ఉపరితలం, స్థానం యొక్క గదిలో ఆన్‌లైన్ సమాచారాన్ని అందిస్తుంది. ఉపరితల కణితుల కోసం, SGRT 3-పాయింట్-లేజర్‌లతో పోలిస్తే మరింత ఖచ్చితమైన స్థానానికి అనుమతిస్తుంది. కొన్ని సందర్భాల్లో రోజువారీ ఇమేజింగ్ సంఖ్యను తగ్గించడానికి అనుమతించవచ్చు. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ దక్షిణాసియాలోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ చైన్, ఈ ప్రాంతంలో 16 క్యాన్సర్ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. వైద్యులు- పరిశ్రమ నిపుణుల బృందంచే 2012లో స్థాపించబడిన ఏఓఐ, నేడు అతిపెద్ద క్యాన్సర్ మెడికల్ టెక్నాలజీ కంపెనీ- సిమెన్స్ హెల్త్‌నీర్స్ కంపెనీ అయిన వేరియన్ మెడికల్ సిస్టమ్స్‌కు పూర్తిగా అనుబంధ సంస్థగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు