క్యాల్షియం మాత్రలెందుకూ... వీటిని జావలా తీసుకుంటే...

శనివారం, 23 మార్చి 2019 (20:31 IST)
మనకు ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే రాగులలో మనకు తెలియని ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇతర గింజల్లో వేటిల్లో లేనంత కాల్షియం నిల్వలు రాగుల్లో వుంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకల పుష్టి కోసం కొందరు క్యాల్షియం మాత్రలను వాడుతుంటారు. వాటికి బదులు రోజూ రాగి జావ తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. రాగుల్లోని ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.
 
1. పిల్లలు పుష్టిగా, వారి ఎముకలు బలంగా వుండాలంటే ప్రతిరోజూ రాగి జావ ఇస్తుండాలి. 
 
2. రాగుల్లో కొవ్వు తక్కువ కనుక అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటుంటే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం కాకుండా రాగులు తీసుకుంటుంటే బరువు కంట్రోల్ అవుతుంది. 
 
3. అమినో ఆసిడ్లు వుండటం వల్ల అధిక బరువు వున్నవారు బరువు తగ్గి మామూలు స్థితికి వచ్చే అవకాశం వుంటుంది.
 
4. అత్యధిక స్థాయిలో పాలిఫెనాల్, ఫైబర్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి ఇది మంచి మందుగా కూడా పనిచేస్తుంది.
 
5. సహజసిద్ధంగా కావల్సినంత ఇనుము ఇందులో లభ్యమవుతుంది. అనీమియాతో బాధపడేవారు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకునేందుకు రాగులను తీసుకుంటుంటే మంచి ఫలితం వుంటుంది. విటమిన్ సి స్థాయిలను కూడా ఇది పెంచుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు