పాకిస్థాన్ సెనేట్‌కు హిందూ దళిత మహిళ...

ఆదివారం, 4 మార్చి 2018 (15:22 IST)
పాకిస్థాన్‌‌లో భారత హిందూ మహిళకు అరుదైన గౌరవం జరిగింది. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన హిందూ మహిళ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌ సెనేట్‌కు హిందూ దళిత మహిళ కృష్ణకుమారి కోల్హి ఎన్నికైనట్టు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తెలిపింది. 39 ఏళ్ల కోల్హి పీపీపీ సభ్యురాలిగా ఉంది. 
 
ఆమెకు సింధ్‌లోని మైనారిటీ సీటుకు పీపీపీ సెనేట్ టిక్కెట్ ఇచ్చింది. ఇది పాకిస్థాన్‌లో మహిళలు, మైనారిటీ హక్కులకు లభించిన అరుదైన గౌరవంగా పీపీపీ పేర్కొంది. గతంలో రత్న భగవాన్‌దాస్ చావ్లాను తొలి హిందూ మహిళా సెనేటర్‌గా పీపీపీ ఎన్నుకుంది.
 
సింధ్ ప్రావిన్స్‌లోని ధర్ జిల్లా నాగర్‌పర్కర్ శివారు గ్రామానికి చెందిన కోల్హి పేద వ్యవసాయ కుటుంబంలో 1979లో జన్మించారు. 9వ తరగతిలో ఉండగా 16 ఏళ్ల ప్రాయంలోనే లాల్‌చంద్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా విద్యాభ్యాసం కొనసాగించిన కోల్హి 2013లో సింధు యూనివర్శిటీలో సోషియాలజీలో మాస్టర్స్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు