కేఎఫ్‌సీ ఫుడ్ లొట్టలేసుకుని తింటున్నారా..? గొంగళి పురుగులు వున్నాయ్ జాగ్రత్త..!

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:09 IST)
కేఎఫ్‌సీ ఫుడ్ లొట్టలేసుకుని తింటున్నారా..? ఈ కథనం చదివితే ఇక వాంతులు చేసుకుంటారు. ఎందుకంటే.. కేఎఫ్‌సీ చికెన్ స్నాక్ బాక్సును ఆర్డర్ చేసుకుంది.. అంతే అందులో గొంగలి పురుగులు వుండటం చూసి షాకైంది. ఈ సంఘటన కేంబ్రిడ్జ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కేంబ్రిడ్జ్‌లోని కేఎఫ్‌సీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి పాప్‌కార్న్ చికెన్ స్నాక్ బాక్స్‌ను ఆర్డర్ చేసింది. ఆ తర్వాత దానిని తినడం ప్రారంభించింది. అయితే.. ఆమెకు ఆ చిప్స్‌లో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. తీరా ఏంటా అది అని చూస్తే.. అవి గొంగళి పురుగులు అని తేలింది. సదరు యువతి పేరు నిఖిత. 
 
తనకు ఎదురైన సంఘటనను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను ఆర్డర్ చేసిన కేఎఫ్‌సీ ఫుడ్‌లో పురుగులుండటం చూసి వెంటనే బాక్సును విసిరేశానని తెలిపింది. ఇంకా రెండు, మూడు చిప్స్ తిన్నందుకే తాను తర్వాత అస్వస్థతకు గురయ్యానని తెలిపింది. కాగా.. మరుసటి రోజు యువతి దీనిపై సదరు కంపెనీకి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా.. వారు కనీసం వినించుకోలేదట. ఆ ఫుడ్‌కి కనీసం రిఫండ్ కూడా ఇవ్వలేదని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు