గొంతునొప్పి అని వెళ్తే ఏలికపామును వెలికి తీశారు.. పచ్చి చేపను అలానే తినడం వల్లే?

బుధవారం, 15 జులై 2020 (19:21 IST)
Worm
గొంతునొప్పిగా వుందని డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళను పరీక్షించిన వైద్యులు అవాక్కయ్యారు. గొంతునొప్పితో బాధపడుతూ తన దగ్గరికి వచ్చిన ఓ మహిళ టాన్సిల్స్‌‌‍లో పెద్ద ఏలికపామును చూసి వైద్యలు షాకయ్యారు. ఈ ఘటన జపాన్‌లోని టోక్యోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని టోక్యోకు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ గొంతునొప్పితో బాధపడుతూ సెయింట్‌ లూకా దవాఖానకు వచ్చింది. 
 
అయితే, సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చిన జలుబు వల్ల గొంతునొప్పి వచ్చిందని డాక్టర్లు మొదట భావించారు. కాగా, తాను సాషిమిని అనే చేపను తిన్న తర్వాత ఈ నొప్పి ప్రారంభమైందని ఆమె వైద్యులకు వివరించింది. 
 
ఈ చేపను జపనీయులు పచ్చిగానే ఉడికించకుండా తినేస్తుంటారు. దీన్ని విన్న వైద్యులు ఎందుకో నిశితంగా పరీక్షించగా..  గవదలలో ఓ ఏలికపామున్నట్లు గుర్తించారు. ఇది ఏకంగా 1.5 అంగుళాల పొడవు వున్నది. దానిని అతినెమ్మదిగా తొలగించి, మహిళ ప్రాణం కాపాడారు. 
 
ఒక మిల్లీ మీటర్‌ వెడల్పు గల ఈ రౌండ్‌వార్మ్‌ను మహిళ టాన్సిల్స్ నుంచి పట్టుకారు ఉపయోగించి తొలగించారు. తొలగించేటప్పుడు కూడా ఈ ఏలికపాము సజీవంగానే ఉంది. డీఎన్‌ఏ పరీక్ష తరువాత, అది నాలుగో దశ లార్వాగా గుర్తించారు. అంటే సదరు మహిళ సాషిమి డిష్‌ తీసుకున్నప్పుడు అది మూడో దశ లార్వాగా ఉన్నదని పేర్కొన్నారు. 
 
పచ్చిమాంసం తినేవారిలో ఈ పరాన్నజీవులు కనిపిస్తాయని వారు వివరించారు. సదరు మహిళ పరిస్థితి అదృష్టవశాత్తు బాగానే ఉందని, ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు