ఐపీఎల్ 2021లో శ్రీశాంత్.. రిజిస్టర్ చేసుకున్న అర్జున్ టెండూల్కర్

శనివారం, 6 ఫిబ్రవరి 2021 (10:16 IST)
IPL
కాసుల వర్షం కురిపించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నీలో వివాదాస్పద భారత క్రికెటర్‌ శ్రీశాంత్‌ మళ్లీ ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సీజన్‌ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు రూ. 75 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫిక్సింగ్‌ మరకలున్న అతనిపై ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూస్తోందో వేచి చూడాలి. 
 
అలాగే భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ కూడా ఈ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అర్జున్‌ రూ. 20 లక్షల కనీస ధరతో పేరును రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఈ నెల 18న జరిగే ఆటగాళ్ల వేలానికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది.
 
మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో కేవలం 61 ఖాళీలే ఉన్న ఈ సీజన్‌ కోసం 1,097 మంది ఆటగాళ్లు వేలంలో పోటీపడుతున్నారు. మిషెల్‌ స్టార్క్, ప్యాటిన్సన్‌ (ఆస్ట్రేలియా), జో రూట్‌ (ఇంగ్లండ్‌)లాంటి అంతర్జాతీయ స్టార్లు ఈ వేలంలో పాల్గొనడం లేదు. వేలం బరిలో 814 మంది భారత ఆటగాళ్లు (21 అంతర్జాతీయ క్రికెటర్లు, 793 అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు) ఉన్నారు. 283 మంది విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీల కంటపడేందుకు బోర్డు వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు