నవంబర్ 30న మోటో జీ 5జీ మొబైల్‌.. రూ.24వేల నుంచి మొదలు

గురువారం, 26 నవంబరు 2020 (19:23 IST)
Motorola Moto G 5G India
భారత్ మార్కెట్లోకి మోజీ జీ 5జీ స్మార్ట్ ఫోన్ రానుంది. నవంబర్ 30వ తేదీన ఈ మొబైల్ ఫోనును విడుదల చేస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిని వన్‌ ప్లస్‌ నార్డ్‌ మొబైల్‌గా రూపొందించారు. ఇంకా ఈ మొబైల్‌ పేరును అధికారికంగా ప్రకటించలేదు. భారత్‌లో ఈ మొబైల్‌ ధర రూ. 24,999 నుంచి మొదలవుతుంది.
 
మోటోరోలా కంపెనీ భారత్‌లో 'రాజ్ర్‌ 5జీ'తో గతంలో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను రూపొందించింది. తాజాగా 'మోటో జీ 5జీ' స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించి మార్కెట్‌లోకి తీసుకురానుంది మోటోరోలా. ఇప్పటికే ఈ మొబైల్‌ యూరప్‌ మార్కెట్లో అమ్ముడవుతోంది. 
 
మోటో జీ 5జీ మొబైల్‌ ఫీచర్స్‌ సంగతికి వస్తే.. 
ఇందులో 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఉంటుంది.
ఈ స్టోరేజ్‌‌ను మెమోరీ కార్డు ద్వారా పెంచుకునే వెసులుబాటు ఉంది. 
బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్‌, 20వాట్స్‌ వేగంతో చార్జింగ్‌ అవుతుంది. 
 
6.7 అంగుళాలు, 1080ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్ప్లే , 20.9 ఆస్పెక్ట్‌ రేషియో ఉంటుంది.
ఈ మొబైల్‌లో మూడు కెమెరాలు ఉంటాయి.
48 ఎంపీ(మెగా పిక్సెల్‌) వరకు ప్రధాన కెమెరాను సరిచేసుకోవచ్చు. 
8 ఎంపీ విస్తృత కోణంలో ఉంటుంది. 
2 ఎంపీ చిన్న కెమెరా ఉంటుంది. ఫ్రంట్‌ కెమెరా 16 ఎంపీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు