బిస్కెట్లు, క్రీమ్ బిస్కెట్లు పిల్లలకు ఇస్తున్నారా? (video)

బుధవారం, 3 మార్చి 2021 (20:28 IST)
Biscuits
సాధారణ బిస్కెట్ల కంటే క్రీమ్ బిస్కెట్లు పిల్లలకు ఇవ్వడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రీమ్ బిస్కెట్లలో చేర్చే ఫ్లేవర్లు, కలర్స్‌లలో రసాయనాలు ఎక్కువగా వుంటాయి. ఇంకా ఉప్పు చేర్చే బిస్కెట్లలో సోడియం కార్బనేట్ వంటివి రక్తపోటును పెంచుతాయి. అధిక సోడియం కలిపిన బిస్కెట్లను పిల్లలు తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 
 
అలాగే బిస్కెట్లు మైదాపిండి తయారవుతున్న కారణంగా పిల్లల్లో మలబద్ధకాన్ని ఏర్పరుస్తాయి. అలాగే ఒక గ్లాసుడు పాలలో రెండు బిస్కెట్లు పిల్లలకు ఇవ్వడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా పిల్లల్లో చురుకుదనం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. బిస్కెట్లలోని సుక్రోస్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది. తద్వారా డయాబెటిస్ తప్పదు. 
 
అయితే షుగర్ ఫ్రీ బిస్కెట్లలోనూ సుక్రోస్ లేకపోయినా.. దానికి బదులు షుగర్ ఫ్రీ మాత్రలు, కార్న్ ఫ్లోర్, షుగర్ సిరప్ చేర్చుతారు. ఇవి శరీర మెటబాలిజం స్థాయిలను తగ్గించేస్తాయి. తద్వారా కాలేయ సమస్యలు ఏర్పడే అవకాశం వుంది. 
 
అందుచేత పిల్లలకు, పెద్దలకు ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని ఇవ్వడం చేయాలి. తృణధాన్యాలతో చేసిన ఫలహారాలు, నట్స్‌తో చేసిన స్నాక్స్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు