డెహ్రాడూన్‌లో ఘోరం.. లోయలో పడిన యాత్రికుల బస్సు

ఆదివారం, 20 ఆగస్టు 2023 (21:20 IST)
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర కాశీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ  ప్రమాదంలో ఏడుగురు చనిపోగా, మరో 27మందికి గాయాలయ్యాయి. సుమారుగా 40 మంది ప్రయాణికులతో ఉత్తరాక్షి నుంచి గంగోత్రి వైపు వస్తున్న బస్సు ఒకటి గంగనమి వద్ద లోయలో పడిపోయింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు. 
 
ప్రమాద వార్త తెలియగానే, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ విపత్తు స్పందన దళాలు, వైద్య సిబ్బంది ప్రస్తుతం అక్కడే ఉన్నట్టు చెప్పారు. సహాయక చర్యల కోసం అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో ముందుగానే ఓ హెలికాప్టర్‌ను సైతం సిద్ధం చేసి ఉంచామన్నారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు