ప్రియురాలిని లొంగదీసుకుని నమ్మించాడు.. పెళ్లికి సిద్ధమయ్యాడు.. చివరికి?

గురువారం, 26 నవంబరు 2020 (17:04 IST)
కరోనా టైమ్‌లో పెళ్లిళ్లు రోజుకో వింతగా జరుగుతున్నాయి. కొన్ని పెళ్ళిళ్లు బంధువులు లేకుండానే జరిగిపోతున్నాయి. మరికొన్ని పరిమిత సభ్యుల మధ్య జరుగతున్నాయి. పెళ్లి కోసం అందరూ ఎన్నో కలలు కంటుంటారు. తాజాగా తెల్లాసరికి పెళ్లనగా ఓ వరుడికి అనూహ్య పరిణామం తప్పలేదు. 
 
ఇక పొద్దున్నే పెళ్లనగా వరుడికి ఊహించని షాక్ తగిలింది. తాను చేసిన పాపం వెంటాడడంతో పెళ్లి పీటలెక్కాల్సిన వాడు నేరుగా జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్ నగర్‌కి చెందిన యువకుడు(27) అదే ప్రాంతానికి చెందిన యువతి(26) కొద్దికాలంగా ఒక్కరిని ఒకరు ప్రేమించుకున్నారు. 
 
అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ప్రియురాలిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. తీరా ఆమెపై మోజు తీరాక ప్రియుడు ముఖం చాటేశాడు. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలు ఈ నెల 20న పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడని ఫిర్యాదు చేసింది.
 
యువకుడిలో ఎలాంటి మార్పు కనిపించ లేదు. దీంతో దారుణ నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు మరో యువతితో పెళ్లికి రెడీ అవుతున్న ప్రియుడి ఇంటికి వెళ్లింది. అతని ఇంటి ముందే ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్థానికులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మోసగాడిని అరెస్టు చేసి జైలుకి పంపించారు. పెళ్లి పేరుతో తనను నమ్మించి అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేసిందని.. అయితే అతను మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో ఆత్మహత్య చేసుకుందని రామ్‌రాజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యేంద్ర నగార్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు