ఓ వివాహిత - ఓ యువతి.. గాఢ ప్రేమికులు... చివరకు...

బుధవారం, 20 మే 2020 (13:36 IST)
ఓ యువతికి వివాహమై భర్త ఉన్నాడు. కానీ, కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ మహిళకు చిన్నప్పటి నుంచి ఓ స్నేహితురాలువుంది. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరిపై ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమే వారిద్దరినీ లెస్బియన్స్‌గా మార్చింది. ఈ క్రమంలో ఓ యువతికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. కానీ, ఆమె ధ్యాసంతా తోటి స్నేహితురాలిపైనే. 
 
అందుకే, భర్త వద్ద సంసార జీవితం కొనసాగించలేక వదిలిపెట్టి పుట్టింటికి వచ్చింది. దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివాహితకు తన స్నేహితురాలితో లైగింక సంబంధం ఉన్నట్టు తేలింది. అంటే... లెస్బియన్స్‌గా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అయితే, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ, పెద్దలు అంగీకరించకపోవడంతో వారిద్దరూ విగతజీవులయ్యారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నామక్కల్ పట్టణానికి చెందిన 23 యేళ్ళు, 20 యేళ్ళ యువతులు ఉన్నారు. వీరిద్దరూ పెరియ మనాలిలో ఉన్న ఓ మగ్గం పరిశ్రమలో పని చేస్తూ, మంచి స్నేహితురాళ్ళుగా ఉంటూవచ్చారు. ఈ సంబంధం కాస్త లైంగిక బంధానికిదారితీసింది. 
 
ఈ క్రమంలో ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లిచేశారు. వారికి రెండేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చేసింది. 
 
ఆ తర్వాత స్నేహితురాలిని తరచూ కలుస్తూవుండేది. వీరి బంధం గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వివాహితతో దూరంగా ఉండాలని ఆమెను హెచ్చరించారు. అంతేకాదు, రాశిపురానికి చెందిన వ్యక్తితో యువతికి మే 27న పెళ్లి చేయాలని నిర్ణయించారు. 
 
గత శనివారం, యువతి ఆ వివాహిత ఇంటికి ఉదయం 11 గంటలకు వెళ్లి కలిసింది. సాయంత్రం 3 గంటలకు ఆ వివాహిత సోదరుడు గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని కనిపించారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించామని పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు