మూడు నెలల్లోనే కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు : చిదంబరం

మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:41 IST)
ఆరు నెలల తరువాత కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు వస్తాడని ఆ పార్టీ ప్రకటించగా.. మూడు నెలల్లోపే అది జరుగుతుందంటున్నారు సీనియర్ నేత చిదంబరం.

ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విషయాలు వెల్లడించారు. మరో మూడు నెలల్లోనే ఏఐసీసీ ఎన్నికలు జరుగుతాయని, అవి పూర్తి కాగానే, నూతన అధ్యక్షుణ్ని ఎన్నుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది కాబట్టి ఎన్నికలు నిర్వహించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇతరులకు అధ్యక్ష పగ్గాలు అప్పగించడంపై ఓ కొత్త మార్గం కనుగొన్నామన్నారు.

సోనియా, రాహుల్ క్రియాశీలకంగా లేరన్నది పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. 2004 లో బీజేపీలో కూడా ఇదే విధంగా జరిగిందని, అప్పుడు బీజేపీని మీడియా ప్రశ్నించలేదని, కాంగ్రెస్ వెంటే పడుతోందని విమర్శించారు. మీడియా ఎప్పుడూ విపక్షం వైపే ఉండాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు