ఆనంద్ విహార్ రైలు స్టేషన్.. లగేజీ మోసిన రాహుల్ గాంధీ

గురువారం, 21 సెప్టెంబరు 2023 (14:06 IST)
Rahul Gandhi
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఆనంద్ విహార్ రైలు స్టేషన్ వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీ కార్మికులతో (పోర్టర్స్) సంభాషించారు. ఈ సందర్భంగా ఎరుపు రంగు షర్ట్ ధరించారు. రైలు కార్మికుల్లా సూట్ కేసును నెత్తిన మోశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ పేజిలో రాహుల్ గాంధీ షేర్ చేసారు. 
 
ఇటీవల, రెయిల్ స్టేషన్ పోర్టర్ స్నేహితులు అతనిని కలవడానికి ఇష్టపడే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గురువారం రాహుల్ గాంధీ వారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు