ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే?

శనివారం, 30 జూన్ 2018 (11:08 IST)
ఈ క్రింది మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఏంటంటే నల మహారాజు రాజ్య భ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది. అందుచేతనే ప్రతిరోజు శనివారం ఈ క్రింది మంత్రాన్ని జపిస్తే మంచిది.
 
శని శాంతి మంత్ర స్తుతి
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ 
ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్ 
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజనమేచకాయ 
శ్రుత్వా రహస్యం భవకామదశ్చ ఫలప్రదో మే భవ సూర్యపుత్రం 
నమోస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయ వై నమః
శనైశ్చరాయ క్రూరాయ శుద్దబుధ్ధి ప్రదాయనే 
య ఏభిర్నామభిః స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు