రాములోరి కల్యాణం.. 8 కేజీల గోటి తలంబ్రాలు సిద్ధం

గురువారం, 30 మార్చి 2023 (09:19 IST)
శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలం రామయ్య కల్యాణ వేడుక పండుగలా జరుగనుంది. సీతారాముల పరిణయ వేడుకలో ఖమ్మం నగరానికి చెందిన అనంత పద్మనాభ కోలాట భక్తబృందం అందించిన 8 కేజీల గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు. 
 
పతకముడి లక్ష్మి సారథ్యంలోని బృందం సభ్యులు తలంబ్రాల కోసం మంగళగూడెంలో ప్రత్యేకంగా వరి పండించారు.  గోటితో ఒలిచిన 8 కిలోల తలంబ్రాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సమర్పించారు. రాములోరి కల్యాణంలో ఈ గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు