తెలంగాణ ఎన్నికలు.. కాంగ్రెస్ 46 శాతం ఓట్లతో విజయం?

బుధవారం, 22 నవంబరు 2023 (19:22 IST)
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండుతున్నాయి. అసెంబ్లీలో ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది పెద్ద ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 46 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని లోక్ పోల్ తాజా సర్వేలో తేలింది. 
 
కాంగ్రెస్‌ 69-72 స్థానాల్లో విజయం సాధిస్తే, బీఆర్‌ఎస్‌ 35-39 స్థానాలకు పరిమితమవుతుందనీ, బీఆర్‌ఎస్‌కు కనీసం 40 సీట్లు రావడం చాలా కష్టమని నివేదిక పేర్కొంది.
 
ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ చెప్తున్నప్పటికీ కనీసం 3 నియోజకవర్గాల్లో విజయం నమోదు చేయడం చాలా కష్టమైన పని. కానీ ఎంఐఎం 6 నియోజకవర్గాల్లో గెలుస్తుందని నివేదిక పేర్కొంది.
 
కాంగ్రెస్‌కు 43-46 శాతం ఓట్లు వస్తాయని, బీఆర్‌ఎస్‌కు 38-41 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదిక పేర్కొంది. బీఆర్‌ఎస్‌కు 41% ఓట్లు వచ్చినా, ఆ పార్టీకి ఇన్ని సీట్లు రావడం కష్టం. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 46.78 శాతం ఓట్లు రాగా, ఈసారి అది 6 శాతానికి తగ్గనుంది.
 
2018 ఎన్నికలలో కేవలం 28.43 శాతం ఓట్లను మాత్రమే సాధించిన కాంగ్రెస్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని, దాదాపు 46 శాతం ఓట్లను సాధిస్తుందని అంచనా.
 
బీజేపీ గత ఎన్నికల్లో సాధించిన దాదాపు 7-8 ఓట్ల శాతాన్ని ఈసారి కూడా సాధిస్తుంది. విశేషమేమిటంటే, బిజెపి హార్డ్ కోర్ ఓట్లను మాత్రమే పొందగలదు. ఇతరులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
 
ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల సందర్భంగా లోక్ పోల్ సర్వే సరైనదని రుజువు చేయడం గమనార్హం. కాంగ్రెస్‌కు 134 సీట్లు, బీజేపీకి 65 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. 
 
తెలంగాణలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 72 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేస్తోంది. ఈ అంచనాల్లో నిజమెంతో తెలియాలంటే ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు