రూ.28 లక్షలు పోగొట్టుకున్న టెక్కీ: యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా అమాయక ప్రజలను..?

సోమవారం, 24 జులై 2023 (21:03 IST)
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శివ ఆన్‌లైన్‌లో రూ.28 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు విచారణ చేపట్టారు. చైనా మద్దతు ఉన్న ముఠా రూ.700 కోట్ల మేర మోసం చేసిందని విచారణలో తేలింది. దీనికి సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. 
 
ఈ స్కామ్‌లో కొంత భాగాన్ని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు కూడా బదిలీ చేశారు. వివరాల్లోకి వెళితే.. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెవిన్ జున్, లు లాంగ్షో, షాషా అనే ముగ్గురు వ్యక్తులతో కూడిన ఈ ముఠా భారత్‌లోని కొందరి సహకారంతో పనిచేస్తోంది. 
 
వెబ్‌సైట్‌లో కొన్ని చిన్న పనులను పూర్తి చేయమని అమాయకులను అడగడం ద్వారా మోసం ప్రాసెస్ చేశారు. అహ్మదాబాద్ నగరానికి చెందిన ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి ఈ కుంభకోణానికి సూత్రధారులుగా అరెస్టయ్యారు. వివిధ బోగస్ కంపెనీల పేరుతో 48 బ్యాంకు ఖాతాల్లోకి 584 కోట్లు చెల్లించారు. తదుపరి విచారణలో వివిధ బ్యాంకు ఖాతాల్లో మరో రూ.128 కోట్లు అక్రమంగా ఇన్వెస్ట్ చేసినట్లు తేలింది.
 
రూ.700 కోట్లకు పైగా మోసం జరిగింది. ఈ స్కామ్‌లో, ముఠా యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా అమాయక ప్రజలను టార్గెట్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు