సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద భారీ పేలుడు!

ఆదివారం, 25 అక్టోబరు 2020 (11:18 IST)
దసరా పండుగ వేళ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పేలుడు స్థానికంగా కలకలం రేపింది. ఆలయం వద్ద ఉన్న చెత్తకుప్పలో వ్యర్థాలను తొలగించేందుకు వచ్చిన ఓ వ్యక్తి, దానిలో కనిపించిన పెయింట్ డబ్బాను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, భారీ శబ్దంతో అది పేలింది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలు అయ్యాయి. ఆయన్ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. డబ్బాలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పేలింది ఓ టిన్నర్ డబ్బా అని ప్రాథమికంగా తేల్చారు. దసరా పండగ నాడు ఈ ఘటన జరగడంతో, ఆలయంలోని భక్తులతో పాటు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జరిగిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. చెత్తకుప్పలో ఉన్న పెయింట్‌ డబ్బా పేలిందని పోలీసులు గుర్తించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు