ఏప్రిల్‌ 9న షర్మిల కొత్త పార్టీ?

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:44 IST)
ఏప్రిల్‌ 9న వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో లక్షమందితో భారీ సభ ఏర్పాటు చేసి.. అదే వేదికపై పార్టీ ప్రకటన తేదీని వెల్లడించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003 ఏప్రిల్‌ 9న చేవెళ్ల నుంచి వైఎ్‌సఆర్‌ తన పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించడానికి అదే రోజును షర్మిల ఎంచుకున్నట్లు తెలిసింది. ఖమ్మం నుంచి వచ్చిన పలువురు వైఎ్‌సఆర్‌ అభిమానులు గురువారం లోట్‌సపాండ్‌లో షర్మిలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఏప్రిల్‌ 9న ఖమ్మంలో సభ నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల.. చివరి సమావేశం ఖమ్మంలో చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో మార్గమధ్యంలో అభిమానులను పలకరిస్తూ వెళ్లాలని, అక్కడ ఆత్మీయ సమావేశంలో పాల్గొని గతంలో నిర్ణయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు