జూన్ రెండో వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు- సబితా ఇంద్రారెడ్డి

గురువారం, 7 మే 2020 (18:30 IST)
తెలంగాణ ఇంటర్ ఫలితాలు జూన్ రెండో వారంలో విడుదల కానున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ పరీక్ష పేపర్లు వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే పేపర్‌ కోడింగ్‌ ప్రక్రియ మొదలైందని చెప్పుకొచ్చారు.
 
కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. 
 
ఇకపోతే ప్రైవేట్ పాఠశాలలు గత ఏడాది ఫీజులే ఈ విద్యా సంవత్సరంలోనూ వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు