13ఏళ్ల బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. కంప్లైంట్ చేస్తే పట్టించుకోని పోలీసులు

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (19:20 IST)
దేశంలో మహిళలపై నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తుల గ్యాంగ్ రేప్ చేసి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు.

ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇంతవరకు వారిపేర్లను బయటకు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. నిందితుల వద్దనుండి డబ్బులు తీసుకొని ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.  
 
వివరాల్లోకి వెళితే.. 13 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండల పరిధిలోని దుంపకుంట సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లారు కామాంధులు. అక్కడ ఈ ముగ్గురు కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

ఇంటికి వచ్చిన బాలిక ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు ఆ బాలికను నిలదీశారు. భయపడిపోయిన ఆ బాలిక ముగ్గురు వ్యక్తులు కలిసి నన్ను బలవంతంగా లాక్కెళ్ళి అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ జోగిపేటలో ఫిర్యాదు చేశారు.
 
ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా విచారణ కొనసాగతుందని వారికి సమాధానం చెబుతున్నారు. కానీ నిందితులు వద్ద లంచం తీసుకొని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు