పరశురామ్‌కి క్లారిటీ ఇచ్చిన మహేష్‌, ఇంతకీ ఏంటది..?

సోమవారం, 17 ఆగస్టు 2020 (23:43 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్‌కి ఓకే చెప్పడం.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా స్టార్ట్ చేయడం తెలిసిందే. అయితే... సమ్మర్ తర్వాత సెట్స్ పైకి వెళదాం అనుకున్నారు. ఇంతలో కరోనా రావడంతో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ పడింది. అయితే.. ప్రభుత్వం షూటింగ్‌కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత చిన్న సినిమాలు కొన్ని షూటింగ్స్ స్టార్ట్ చేసాయి కానీ.. స్టార్ హీరోలు షూటింగ్ చేయడానికి ముందుకు రాలేదు. 
 
దీంతో పెద్ద సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది క్లారిటీ లేదు. 2021 జనవరి వరకు పెద్ద సినిమాలు సెట్స్ పైకి వెళ్లవు అని వార్తలు వచ్చాయి. దీంతో మహేష్‌ బాబు కూడా జనవరి నుంచే షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది. దీనికి సంబంధించి తాజా వార్త ఏంటంటే... మహేష్‌ బాబు అక్టోబరు నెలాఖరు నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దామని పరశురామ్‌కి చెప్పాడట. ముందు ఆర్టిస్టులు తక్కువుగా ఉన్న సీన్స్ షూట్ చేద్దామని చెప్పాడట.
 
మహేష్ చెప్పినట్టుగా అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ క్రేజీ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు