కరోనా వచ్చినా బిగ్ బాస్ ఆగలేదుగా.. ప్రోమో వచ్చేసిందిగా..

సోమవారం, 20 జులై 2020 (22:10 IST)
BB4
కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో టీవీ షోలు జరిగే అవకాశాల్లేవని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రతరం అవుతున్న తరుణంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం కానుందనే సంకేతాలు వెలువడ్డాయి. తద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ గుడ్ న్యూస్ చెప్పారు.

ఈ ఏడాది బిగ్‌బాస్‌ షో ఉంటుందా? లేదా? అనే అనుమానాలున్నాయి. కానీ వాటన్నింటికీ తెరదించుతూ.. బిగ్‌బాస్‌ సీజన్‌-4 పై స్టార్‌ మా అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే బిగ్‌బాస్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు బిగ్‌బాస్‌ లోగోతో కూడిన ప్రోమోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 
 
బిగ్‌బాస్‌ సీజన్‌-4పై స్టార్‌ మా క్లారిటీ ఇవ్వడంతో.. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్‌లు, హోస్ట్‌ వివరాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్‌ సెట్‌ వర్క్స్‌ ప్రారంభమయ్యాయి. అలాగే కంటెస్టెంట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతుంది.

త్వరలోనే మొదలయ్యే ఈ షోలో కంటెస్టెంట్స్‌గా ఈ సారి మరింత స్టార్ క్యాస్ట్ యాడ్ చేయాలని చూస్తున్నారు స్టార్ మా. దీనికోసం భారీగానే ఖర్చు చేసి మరీ పేరున్న వాళ్లనే బిగ్ బాస్ హౌజ్‌కు పట్టుకొస్తున్నారని తెలుస్తుంది. 
 
ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ బిగ్ బాస్ నాలుగో సీజన్ కోసం వస్తున్నాడని తెలుస్తుంది. అలాగే సంచలన యాంకర్ రష్మి గౌతమ్‌కు భారీ మొత్తం ఇచ్చి బిగ్ బాస్ 4లో తీసుకోవాలని చూస్తున్నారు. మరో యాంకర్ కమ్ సింగర్ మంగ్లీ కూడా ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌కు వస్తుందని ప్రచారం జరుగుతుంది.

సింగర్ గీతా మాధురి భర్త నందుకు బిగ్ బాస్ 4 ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జోరుగానే జరుగుతుంది. హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్‌కు ఎలాగూ ఆఫర్స్ లేవు.. అందుకే బిగ్ బాస్ వైపు అడుగులేస్తుందని వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు