ఆసుప‌త్రిలో చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్

గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:53 IST)
Kalyan dev, letter
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ ప్ర‌స్తుతం ఆసుప్ర‌తిలో జేరారు. కోవిడ్ బారిన ఆయ‌న ప‌డ్డారు. ఇటీవ‌లే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కోవిడ్ పాజిటివ్ నుంచి నెగెటివ్‌కు వ‌చ్చారు. కాగా,  చిరంజీవి కుమార్తె శ్రీ‌జ భ‌ర్త క‌ళ్యాణ్‌దేవ్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో నిన్న పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా పాజిటివ్‌ అని తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాన్నట్లు చెప్పారు.

త్వరలోనే కోలుకుంటానని, ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక నాగబాబు సైతం కల్యాణ్‌దేవ్‌ పోస్ట్‌పై స్పందించారు. త్వరగా కోలుకుంటావనే నమ్మకం, గెట్‌ వెల్‌ సూన్‌ మై బాయ్‌ అంటూ కామెంట్‌ చేశారు. తాజాగా ఆయ‌న ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఆ సినిమా హీరోయిన్ అవికా గౌర్‌ సహా చిత్ర యూనిట్ ఆయ‌న త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు