హిందువులను లేకుండా చేయాలని చూస్తున్న రాజకీయ వ్యవస్థ - నటి మాధవీ లత ఫైర్

సోమవారం, 20 నవంబరు 2023 (10:16 IST)
Madhavi Latha
ప్రస్తుతం తెలంగాణాలోనూ ఇతర చోట్ల రాజకీయ వేడి పుంజుకుంది. ఎలక్షన్ల లో గెలుపు కోసం ఎవరికి వారు తాయిలాలు అంటే మిఠాయిలు ఇచ్చి ప్రజలకు బుజ్జగిస్తున్నారు. ముఖ్యంగా హిందూవులను లేకుండా చేస్తున్నారు.  ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇతర మతస్తులను ప్రోత్సహించేలా వారి ఎజెండాలు వున్నాయని నటి మాధవీ లత ఫైర్ అయింది. 
 
కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పెద్ద పీఠ వేసింది.వారి పెళ్లిళ్ళకు, చదువులకు పెద్ద మొత్తంలో సాయం చేస్తామని హామీ ఇస్తోంది. అదే విదంగా క్రైస్తవుల ఫాదర్లకు ఇతర మతస్తులకు నెలవారి జీతం ఇస్తామని ప్రకటించింది. మరి హిందూవేవాలయాల్లో పేద పూజారులు ఎంతో మంది వున్నారు. వారి గురించి ఒక్క పార్టీ కూడా పట్టించుకోలేదు. పైగా ఈ డబ్బంతా హిందువులనుంచి వసూలు చేసింది. 
 
హిందూవుల పిల్లలకు చదువులెోకానీ ఇతరత్రా గానీ ఎటువంటి హామీలు లేవు. ఇక తెలంగాణాలో పాలక పార్టీకి చెందిన ఓల్డ్ సిటీ నాయకుడు రోహింగ్యాలను తీసుకు వచ్చి వారికి రేషన్ కార్డ్ ఇచ్చి ప్రోత్సహించారు.  ఇదంతా అంధరికీ తెలిసిందే.  సిక్కులకు ఇతర మతస్తులకు పెద్ద రాయితీలు ప్రకటించింది. ఎటొచ్చీ హిందువుగా పుట్టడం నేరం అన్నట్లుగా వారి తీరు వుంది. సో. ముందు ముందు హిందువులు లేకుండా చేసేలా ఇప్పటి వ్యవస్థ వుంది. దాన్ని మార్చేవారు లేరా? ఇదంతా మోడీకి తెలీదా? అంటూ తన దైన శైలిలో నిప్పులు చెలరేగింది. సో.. ఇదంతా వాస్తవం కాదా? హిందూవులు ఆలోచించండి అంటూ వేడుకుంటోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు