మ‌హేష్ త్వ‌ర‌గా కోలుకోవాలంటున్న మెగాస్టార్ చిరంజీవి

శుక్రవారం, 7 జనవరి 2022 (20:08 IST)
Mahesh-chiru
మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా వుండ‌డం తెలిసిందే. క‌రోనా టైంలో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఇండ‌స్ట్రీ గురించి స్పందిస్తుంటారు. ఇప్పుడు ప్ర‌పంచంతోపాటు దేశ వ్యాప్తంగా క‌రోనా ఒమిక్రాన్ వేవ్ న‌డుస్తోంది. దీనితో ప‌లువురు క‌రోనాబారిన ప‌డుతున్నారు. గురువారంనాడే మహేష్ బాబు తాను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యినట్టు పేర్కొన‌డంతో టాలీవుడ్ కంగారుప‌డింది. 
 
వెంట‌నే మెగాస్టార్ తోపాటు అంద‌రూ ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.  చిరంజీవి ఈ విధంగా తెలియ‌జేశారు. మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అలాగే మళ్ళీ మహేష్, నిన్ను యాక్షన్ మోడ్ లో చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.
 
కాగా, ఇటీవ‌లే త‌న సినిమా సంక్రాంతికి రాక‌పోవ‌డంతో ఆరోగ్య‌పర‌మైన స‌మ‌స్య‌లు వుండ‌డంతో కాలికి శ‌స్త్ర చికిత్స చేసుకోవాల‌ని విదేశాల‌కు వెళ్ళాడు. ఇటీవ‌లే దుబాయ్‌లో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, థ‌మ‌న్‌తో క‌లిసి ఓ సినిమా విష‌య‌మై చ‌ర్చిస్తున్న‌ట్లు పోస్ట్ చేశాడు కూడా. మ‌రి ఇప్పుడు క‌రోనాబారిన ప‌డ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు