బాలయ్య బాబూ.. ఏంటి బాబు ఇది... నర్తనశాల రిలీజ్ అవసరమా?

ఆదివారం, 25 అక్టోబరు 2020 (15:28 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ 'నర్తనశాల' చిత్రం కోసం చిత్రీకరించిన 16 నిమిషాల ఫుటేజ్‌ని రిలీజ్ చేశారు. నర్తనశాల సినిమాలోని 16 నిమిషాల ఫుటేజ్ రిలీజ్ చేస్తానని ప్రకటించగానే... ఎలా ఉంటుందో..? ఎలా డైరెక్ట్ చేసారో..? చూడాలి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడింది. 
 
అయితే... నర్తనశాల శ్రేయాస్ ఏటీటీలో రిలీజ్ చేసారు. తీరా చూసాకా... సామాన్య ప్రేక్షకులే కాకుండా బాలయ్య అభిమానులు సైతం విమర్శిస్తుండడం విశేషం. అవును... బాలయ్య అభిమానులకు కూడా అసలు నచ్చలేదట. అంత ఘోరంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
 
ఇందులో ఉన్న కథ విషయానికి వస్తే... ఆసక్తిగా చూసినవాళ్లకి నర్తనశాల చిత్రంలోని 16 నిమిషాల ఎపిసోడ్ నిరాశనే మిగిల్చింది. అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు.. ఎవ్వరికంట పడకుండా తామూ ధరించబోయే వేషాల గురించి అరిగిపోయిన పాత డైలాగ్స్ చెబుతుండటం చూస్తుంటే.. ఏంటి ఇది అనిపిస్తుంది. 
 
ఏదోలా మొత్తానికి ఓ సుదీర్ఘ సన్నివేశాన్ని లాక్కోస్తారు. అజ్ఞాతవాసానికి సన్నద్ధం అవ్వడానికే ఈ ఫిల్మ్‌లో సగం ఫుటేజ్ సరిపోయింది. పోనీ ఈ సుదీర్ఘ సన్నివేశంలో ఏమైనా ఆసక్తి ఉందా..? అంటే.. అదీ లేదు.
 
ఈ 16 నిమిషాల ఫుటేజ్ చూసిన వాళ్లు... బాలయ్య బాబు.. ఏంటి బాబు ఇది. నర్తనశాలను ఇప్పుడు రిలీజ్ చేయడం అవసరమా..? అంటూ అభిమానులే విమర్శిస్తుండడం విశేషం. మరి... ఈ విమర్శల పై బాలయ్య స్పందిస్తాడేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు