దెబ్బకు మాట మార్చేసిన శృతిహాసన్, అసలు ఏమైంది..?

బుధవారం, 7 అక్టోబరు 2020 (14:57 IST)
కమల్ హాసన్ కుమార్తెగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ కెరీర్ ప్రారంభంలో అనగనగా ఓ థీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో శృతి పైన ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అయినప్పటికీ.. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా శృతిహాసన్ జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో రేసుగుర్రం సినిమాలో నటించింది.
 
ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించడంతో శృతి జీవితమే మారిపోయింది. ఈ అమ్మడుకు వరుసగా అవకాశాలు వచ్చాయి. బిజీ హీరోయిన్ అయ్యింది. అయితే... ఇటీవల బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలు ఇంకా చెప్పాలంటే సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడింది.
 
హిందీ సినిమాలతో పోటీ పడేందుకు తెలుగు సినిమాలు ట్రై చేస్తున్నాయంటూ హిందీ సినిమాలను మెచ్చుకుంటూ.. తెలుగును కాస్త తక్కువ చేసి మాట్లాడటం జరిగింది. ఆమెకు అవకాశాలు ఇచ్చి ఆదరించిన తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల గురించి తక్కువ చేస్తావా అంటూ నెటిజన్లు ఈ అమ్మడును ట్రోల్ చేస్తున్నారు.
 
దీంతో దెబ్బకు దిగి వచ్చిన ఈ అమ్మడు నేను అలా అనలేదు. తెలుగు సినిమాలో గబ్బర్ సింగ్, రేసుగుర్రం ఎప్పటికీ మరచిపోలేను. నా జీవితాన్ని మార్చిన సినిమాలు అవి అంటూ మాట మార్చింది ఈ అమ్మడు. అప్పుడు అలా మాట్లాడటం ఎందుకు..? ఇప్పుడు ఇలా మాట మార్చడం ఎందుకు..? ఇకనైనా తెలుగు సినిమాల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతుందని ఆశిద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు