శ్రావణి ఆత్మహత్య కేసులో ఆ ముగ్గురు అరెస్ట్.. ఆర్‌ఎక్స్‌ 100 నిర్మాతను కూడా..?

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (18:18 IST)
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్‌, సాయిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా మూడో వ్యక్తి ఆర్‌ఎక్స్‌ 100 సినీ నిర్మాత అశోక్‌ రెడ్డిని సైతం సోమవారం విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. 
 
ఈ కేసు విచారణలో భాగంగా... శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయిల స్టేట్‌మెంట్‌ను‌ నమోదు చేశారు. దీనిలో భాగంగానే కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు సాయితో పాటు దేవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కీలక ఆధారాలు లభ్యమైయ్యే వరకు ముగ్గురు అనుమానితులూ తమ అదుపులోని ఉంటారని పోలీసులు తెలిపారు. 
 
శ్రావణి కేసు విచారణలో శ్రావణి కుటుంబ సభ్యులు మాత్రం తన కుమార్తె మృతికి దేవరాజే కారణమని చెప్తున్నారు. కానీ దేవరాజ్‌ మాత్రం సాయి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు లభించిన సాక్ష్యాలు, ఆడియో రికార్డులను పోలీసులు మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు