మార్చి 10న వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

సెల్వి

మంగళవారం, 5 మార్చి 2024 (14:16 IST)
వైఎస్సార్‌సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను మార్చి 10న విడుదల చేయనున్నట్లు నెల్లూరు ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. మార్చి 10న బాపట్లలోని మేదరమెట్లలో పార్టీ సిద్దం సభను నిర్వహిస్తున్నారు. 
 
మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల పది నెలల్లో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తారని, అలాగే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఆవిష్కరిస్తారని తెలిపారు. 
 
మార్చి 10న జరగనున్న సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విజయసాయిరెడ్డి బాపట్లలో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు