తిరుపతి బర్డ్ ఆసుపత్రికి ప్రముఖ వైద్య నిపుణుల రాక.. ఉచితంగా ఓపి సేవలు

గురువారం, 5 నవంబరు 2020 (07:42 IST)
బర్డ్ ఆసుపత్రిలో ఈ నెల 5, 6 తేదీల్లో ప్రముఖ వైద్య నిపుణులు ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ఒక  ప్రకటనలో తెలిపారు. 

5వతేదీ గురువారం బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ హేమంత్ ఉదయం 8 నుండి 10  గంటల  వరకు ఓపి సేవలు అందిస్తారని తెలిపారు.

6వ తేదీ శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చెన్నై అపోలో ఆసుపత్రికి చెందిన మెదడు, వెన్నెముక సర్జన్ డాక్టర్  బాలమురుగన్ ఉచితంగా ఓపి సేవలు అందిస్తారని డైరెక్టర్ చెప్పారు.

డాక్టర్ల అపాయింట్ మెంట్ కోసం 9840201902 ను సంప్రదించాలని ఆయన కోరారు. రోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు