మేనల్లుడి నిశ్చితార్థం కోసం హైదరాబాద్ వెళుతున్న సీఎం జగన్

వరుణ్

గురువారం, 18 జనవరి 2024 (09:43 IST)
తన మేనల్లుడు, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం కోసం వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లి ప్యాలెస్ నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్నారు. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుక పూర్తయిన తర్వాత ఆయన రాత్రికే అమరావతికి చేరుకుంటారు. 
 
కాగా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జనవరి 18వ తేదీన హైదరాబాద్ నగరంలో జరుగనుంది. ఈ వేడుకకు హాజరుకావాలంటూ తన అన్న, ఏపీ సీఎం జగన్‌తో పాటు అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులను షర్మిల స్వయంగా ఆహ్వానించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం గురువారం రాత్రి జరుగుతుంది. 
 
ఇందులో పాల్గొనేందుకు సీఎం జగన్ గురువారం సాయంత్రం 6.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు గంమడిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు వెళ్ళి తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేరుకుంటారు. 19వ తేదీన విజయవాడలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు