సైకో జగన్ చేతిలో ధ్వంసమైన రాష్ట్రాన్ని టీడీపీ కూటమి పునర్మిస్తుంది : నారా లోకేశ్

ఠాగూర్

శుక్రవారం, 15 మార్చి 2024 (10:15 IST)
సైకో జగన్ చేతిలో రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఏర్పాటైన ఎన్డీయే కూటమి పునర్మిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇటీవ‌ల ఇండియాటుడే, తాజాగా ఏబీపీ, న్యూస్ 18.. ఇలా ఏ ఒక్క సంస్థ సర్పే ఫలితాలను వెల్లడించినా ఏపీలో టీడీపీ - బీజేపీ - జ‌న‌సేన కూట‌మిదే తిరుగులేని విజ‌యం అని తేల్చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 
 
అందువల్ల సైకో జ‌గ‌న్ చేతిలో ధ్వంస‌మైన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూట‌మి పున‌ర్మిర్మాణం చేయ‌గ‌ల‌ద‌ని ప్ర‌జ‌లు పూర్తి విశ్వాసంతో ఉన్నార‌ని జాతీయ మీడియా సంస్థల స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయని, ఏపీలో మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో టీడీపీ జనసేన విజయం సాధిస్తాయని గతంలో ఇండియా టుడే సర్వే వెల్లడించ‌గా, ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏబీపీ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో ఎన్డీఏ కూటమి (బిజెపి, టిడిపి, జనసేన) విజయం సాధిస్తాయ‌ని తేలిందని ఆయన గుర్తు చేశారు. 
 
మ‌రో జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 ఒపీనియన్ పోల్ సర్వేలోనూ 18 స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుంద‌ని వెల్ల‌డైందని చెప్పారు. సైకో జ‌గ‌న్ గ్యాంగ్ ఏ విష‌వ్యూహం ప‌న్నినా దారుణ ప‌రాజ‌యం నుంచి వైకాపా త‌ప్పించుకోలేద‌ని స‌ర్వేలు కుండ‌బ‌ద్ద‌లు కొట్టాయి. ప్ర‌జావ్య‌తిరేక తుఫానులో వైకాపాకి అంతిమ‌యాత్ర ఖాయమని, హ‌లో వై నాట్ 175 జ‌గ‌న్.. ఛ‌లో ఇంటికి అంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు