పోలీసులా? వైసిపి ఏజెంట్లా?: ఎమ్మెల్యే గద్దె రామమోహన్

బుధవారం, 5 ఆగస్టు 2020 (19:27 IST)
రాష్ట్రంలో కొంత మంది పోలీసులు వైసిపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ నేడొక ప్రకటనలో విమర్శించారు.

టెక్కలి పట్నంకు చెందిన హరిజన యువకుడు మర్రి జగన్ పై పలాస సిఐ వైసిపి నాయకుల ప్రోద్భలంతో బూట్ కాలితో తన్నడం , చీరాలలో కిరణ్ అనే యువకుడు మాస్క్ వేసుకోలేదని పోలీసులు తల పగులగొట్టి అతని చావుకు కారణమవడం, అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వైసిపి ప్రోద్బలంతో పరప్రసాద్ అనే దళిత యువకుడికి పోలీసులే శిరోమండనం చేయించడం చూస్తుంటే కొన్ని పోలీసు స్టేషన్లు, వైసిపి కార్యాలయాలుగా పనిచేస్తున్నట్లు కనపడుతున్నాయని ప్రశ్నించారు.

గతంలో రాజమండ్రిలో దళిత బాలికపై అత్యాచారం, నర్సీపట్నం డాక్టర్ విషయంలో లాఠీలతో బాధి, పశువుని కట్టేసినట్లు కట్టిన సందర్భం, దళిత మహిళా డాక్టర్ అనితారాణిని వేధించడం, మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ కుమార్ పై తప్పుడు కేసులు పెట్టడం, ఇవన్నీ దళితులపై జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తెలియజేస్తుందన్నారు.

ఆదిలోనే దళితులపై జరిగిన దాడిపై ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికైనా దళితుల విషయంలో ప్రభుత్వం వ్యతిరేక వైఖరి విడనాడి దళితులకు ఆత్మ స్తైర్యాన్ని కలిగించాలని, లేనిపక్షంలో దళితులంతా తిరగబడతారని గద్దె రామమోహన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు