9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ

మంగళవారం, 7 జులై 2020 (18:29 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ వైరస్ ప్రభావం విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా అసలు ఈ యేడాది స్కూల్స్ ప్రారంభమవుతాయా? లేదా? అన్నం సందేహం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలు విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. 
 
తాజాగా సీబీఎస్ఈ కూడా 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్‌ను కుదిస్తున్నామని వెల్లడించింది. ఈ నిర్ణయం 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. 
 
కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. అయితే, సిలబస్ కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని స్పష్టం చేశారు.

 

MHA, in a letter to Union Higher Education Secy, today permitted conduct of exams by universities&institutions. The final Term Exams are to be compulsorily conducted as per UGC Guidelines and as per the Standard Operating Procedure approved by Union Ministry of Health: MHA pic.twitter.com/mTHWTy0GZ3

— ANI (@ANI) July 6, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు