దేశంలో కరోనా.. గడిచిన 24 గంటల్లో 14,989 పాజిటివ్‌ కేసులు

బుధవారం, 3 మార్చి 2021 (10:43 IST)
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మొన్నటి వరకు 16వేలకుపైగా నమోదైన కేసులు... మంగళవారం 12వేల్లోపు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 14,989 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,11,39,516కు పెరిగింది.
 
తాజాగా 13,123 కోలుకోగా.. ఇప్పటి వరకు 1,08,12,044 మంది డిశ్చార్జి అయ్యారని కేంద్రం తెలిపింది. మరో 98 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,70,126 క్రియాశీల కేసులు ఉన్నాయని, టీకా డ్రైవ్‌లో భాగంగా 1,56,20,749 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు