తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనావైరస్ కేసులు: ఏపిలో 23,920, తెలంగాణలో 7,430

సోమవారం, 3 మే 2021 (14:19 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో అనూహ్యంగా 23,920 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో 11,42,127 పాజిటివ్ కేసులు తేలాయి. కాగా వీరిలో 9,90,813 మంది డిశ్చార్జ్ కాగా 8,136 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,43,178.
 
మరోవైపు గత 24 గంటల్లో తెలంగాణలో 7,430 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. మొత్తం 24,567 కోవిడ్ సోకిన రోగులు కోలుకోగా, గత 24 గంటల్లో 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
 రాష్ట్రంలో మొత్తం కొరోనావైరస్ కేసులు 4,50,790గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 80,695. రాష్ట్రంలో 3,67,727 రికవరీలు నమోదయ్యాయి. అధికారిక నివేదిక ప్రకారం 2,368 మరణాలు నమోదయ్యాయి.
 
మరోవైపు భారతదేశం గత 24 గంటల్లో 3,92,448 కొత్త కేసులు, 3,07,865 రికవరీలు మరియు 3,689 మరణాలను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం COVID కేసుల సంఖ్య 1,95,57,457.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు