నీలి చిత్రాలు చూపిస్తూ.. అలా శారీరకసుఖం ఇవ్వాలని భార్యపై ఒత్తిడి...

వరుణ్

మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (08:55 IST)
నిలి చిత్రాల్లో కనిపించే అమ్మాయిలు చేసే విధంగా శృంగారంలో పాల్గొనాంటూ భార్యపై ఒత్తిడి తెచ్చిన ఓ భర్తతో సహా మొత్తం ముగ్గురిపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓ యువతికి గత 2021 ఏప్రిల్ నెలలో వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం ఆమెను భర్త వేధిస్తూ వస్తున్నాడు. నిజానికి వివాహ సమయంలో కట్నం కింద రూ.2 లక్షల నగదు, రూ.50 వేల విలువైన గృహోపకరణ వస్తువులు అందజేశారు. భర్త కృష్ణా జిల్లా కూచిపూడిలో కిరాణా హోల్‌సేల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో గత మూడేళ్లుగా అదనపు కట్నం కోసం ఆమెను వేధించసాగాడు. దీనికి అత్త, మరిదిలు తోడయ్యారు. అదేసమయంలో ఆ వ్యక్తి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. భర్తను నిలదీసింది. దీంతో ఆమెకు మొబైల్ ఫోనులో నీలి చిత్రాలు చూపిస్తూ ఆ విధంగా చేయాలంటూ ఒత్తిడి చేయసాగాడు. ఈ వేధింపులు శృతిమించి పోవడంతో వాటిని తట్టుకోలేని ఆ యువతి.. పుట్టింటికి వెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్తతో పాటు అత్తల, మరిదిలపై విజయవాడ దిశ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చివేస్తాం... బాంబు బెదిరింపు... 
 
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ బెదిరించి ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని వైభవ్ తివారీగా గుర్తించారు. బెంగుళూరు నగరానికి చెందిన ఈ నిందితుడు... విమానంలో హైజాకర్లు ఉన్నారని, వారు బాంబులతో విమాశ్రయాన్ని పేల్చివేస్తారంటూ శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు ఈమెయిల్స్ పంపించాడు. రెండు పర్యాయాలు అతడు ఇలాగే ఈమెయిల్స్ చేరవేశాడు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయం మొత్తం విస్తృతంగా తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో ఎక్కడా కూడా అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దాంతో ఆ బెదిరింపులు ఉత్తుత్తివేనని తేలింది. దీంతో కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి.. బెంగుళూరుకు చెందిన వైభవ్ తివారీయే ఈ నకిలీ బెదిరింపులకు పాల్పడినట్టు గుర్తించి అరెస్టు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన తివారీ ఈ తరహా నకిలీ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు