మూడోసారి అదృష్టం కలిసిరాలేదు.. లాస్య నందిత బయోగ్రఫీ

సెల్వి

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (17:20 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఫిబ్రవరి 23న ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ సమీపంలో సుల్తాన్‌పూర్‌ సమీపంలో రోడ్డు రైలింగ్‌ను ఢీ కొట్టడంతో అదుపుతప్పి ప్రాణాలు కోల్పోయారు. గురువారం రాత్రి సదాశివపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నారు.
 
ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆమె ప్రాణాలు కోల్పోయారు. డిసెంబరులోనూ ఆమె ఓ ప్రమాదంలో చిక్కుకున్నారు. కానీ అదృష్టవశాత్తూ ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓవర్‌లోడ్ కారణంగా లిఫ్ట్ ఆరు అడుగుల ఎత్తులో కూలిపోవడంతో ఆమె అందులో ఇరుక్కుపోయారు.
 
 అలాగే ఫిబ్రవరి 13న మాజీ సీఎం కేసీఆర్‌ సభకు హాజరయ్యేందుకు నల్గొండ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు మృతి చెందాడు.
 
 
 
అయితే ఈరోజు ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన లాస్య తండ్రి సాయన్న గత ఫిబ్రవరిలో మరణించారు. ఆమె 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
 
లాస్య నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే జి. సాయన్న అడుగుజాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 
 
కంటోన్మెంట్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణలతో మరణించడంతో 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను లాస్య నందితకు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కేటాయించింది.
 
పేరు లాస్య నందిత
పూర్తి పేరు లాస్య నందిత
జననం 1986
జన్మస్థలం హైదరాబాద్, తెలంగాణ, 
తోబుట్టువులు- నమ్రత, నివేదిత 
వయస్సు- 37
మరణం- ఫిబ్రవరి 23, 2024 
రోడ్డు ప్రమాదం మరణానికి కారణం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు