కరోనావైరస్ సమయంలో తులసి ఆకులను అలా చేసి తీసుకోవాల్సిందే...

బుధవారం, 24 జూన్ 2020 (22:05 IST)
తులసిలో ఔషధ గుణాలు వున్నందున ఆ ఆకుల కషాయాన్ని జలుబు, ఊపిరితిత్తులలో ఇబ్బందులను తొలగించేందుకు వినియోగిస్తారు. పర్వదినాలలో దేవతలకు చేసే నివేదనలలోను, కొన్ని ప్రత్యేక విందులలోనూ అతిథులకు ఆహారపదార్థాలపై తులసి ఆకును వుంచి అందించడం సంప్రదాయం. 
 
రోగ నిరోధక శక్తిని పెంచడంలో తులసిని మించిన ఔషధ మొక్క మరొకటి లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తులసి ఆకుల రసం, తులసి టీ సర్వరోగ నివారణిలు, ఏదో ఒక రూపంలో తులసిని తరచూ తీసుకోవాలట. అలా చేస్తే ఎంతో ఉపయోగకరమంటున్నారు.
 
నీడలో ఎండబెట్టిన తులసి ఆకులు, రెమ్మలు శుభ్రం చేసి వేళ్ళతో సహా తులసికి సంబంధించినవన్నీ ఒకే గుణం కలిగి ఉంటాయి. ఎండిన తులసిని దంచి అందులోకి యాలకుల పొడి, మిరియాల పొడి, పుదీనా ఆకుల పొడి తగుపాళ్ళలో కలిపి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిన గ్లాసు నీళ్ళలోకి వేసి మరగకాచి అందులో నిమ్మరసం కలుపుకుని రోజుకు మూడు పూటలా టీలాగా సేవించాలి.
 
కొన్ని రకాల తులసి మొక్కల్లో యూజెనాల్, సిట్రాల్, కర్పూరం, థైమాల్ లాంటి శక్తివంతమైన రసాయనాలు ఉంటాయి. అందుకే తులసిని సూక్ష్మజీవి నాశకం అంటారు. రేడియేషన్ చికిత్సలో ఆరోగ్య కణాలు దెబ్బతినకుండా తులసి కాపాడుతుందట. లవంగం వేసి వండే వంటకాల్లో తులసి ఆకుల్ని కూడా వేసి వండుకోవచ్చట. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు