కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

సెల్వి

బుధవారం, 24 ఏప్రియల్ 2024 (20:53 IST)
మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మే 2న తన నిర్ణయాన్ని వెలువరించనుంది.
 
అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే 6న తన తీర్పును వెలువరించనుంది. విచారణ సందర్భంగా, న్యాయస్థానం ముందు విస్తృత వాదనలు వినిపించాయి దర్యాప్తు సంస్థలు.
 
బెయిల్ మంజూరుకు వ్యతిరేకంగా ఇడి తరపు న్యాయవాది దాదాపు రెండు గంటల పాటు వాదించారు. కవిత తరపు డిఫెన్స్ లాయర్లు ఏప్రిల్ 26లోగా రీజయిండర్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. అక్రమ అరెస్టు వాదనల్లో ఎటువంటి మెరిట్ లేదని, మద్యం కేసులో తమ వైఖరిని సమర్థించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఏజెన్సీలు వాదించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు