మలేషియా భద్రతా దళాల అదుపులో 60మంది భారతీయులు!

శనివారం, 27 జూన్ 2020 (08:21 IST)
మలేషియా భద్రతా దళాలు అదుపులో 60 మంది భారతీయులు వున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ భారతీయుడు కొవిడ్-19 లక్షణాలతో మరణించిన ఘటనపై స్పందించిన ఆ దేశ మానవ హక్కుల కమిషన్.. విచారణ చేపట్టింది.

తమిళనాడు, కేరళ, తెలంగాణకు చెందిన చాలా మంది.. హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి ఈ ఏడాది మార్చిలో కౌలాలంపూర్ వెళ్లారు. వీరంతా మార్చి రెండోవారం నాటికి తిరిగి ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే కరోనా విజృంభించడంతో మలేషియా ప్రభుత్వం మార్చి 18 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో హాలిడేస్‌ ఎంజాయ్ చేయడం కోసం వెళ్లిన సుమారు 60 మంది భారతీయులు మలేషియాలో చిక్కుకున్నారు.

ఇదే సమయంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం వేసిన మలేషియా ప్రభుత్వం..వారిని అదుపులోకి తీసుకోవడానికి భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కరోనా కారణంగా అక్కడే చిక్కుకున్న 60 మంది భారతీయులను కూడా అక్కడి భద్రతా దళాలు మే 1న అదుపులోకి తీసుకున్నాయి.

ఈ క్రమంలో భద్రతా దళాల అదుపులో ఉన్న చెన్నైకి చెందిన 67ఏళ్ల జీవ్‌దీన్ ఖాదర్ మస్తాన్ కొవిడ్ లక్షణాలతో మరణించారు. మలేషియా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న 60 మంది భారతీయుల్లో 20 మంది మహిళలు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు