రూ.2.5 కోట్లు పలికిన బాపూజీ కళ్ళజోడు...

ఆదివారం, 23 ఆగస్టు 2020 (12:10 IST)
భారత జాతిపిత మహాత్మా గాంధీ ధరించిన కళ్ళజోడు ధర కోట్లు పలికింది. ఈ కళ్ళజోడును తాజాగా వేలం చేయగా ఇది ఏకంగా 2.50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ ఈ కళ్లజోడును వేలం వేసింది. 
 
ఈ సంస్థ లెటర్ బాక్సుకు వేలాడుతూ ఈ కళ్లజోడు కనిపించిందట. వేలంలో కనీసం 15 వేల యూరోలు(రూ.15లక్షలు) పలుకుతుందని నిర్వాహకులు తొలుత భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఇది 2.6 లక్షల యూరోలు (సుమారు రూ.2.5కోట్లు) పలికింది. 
 
గతంలో సౌతాఫ్రికాలో పనిచేసిన ఓ వ్యక్తి వీటిని సేకరించాడు. వంశపారంపర్యంగా తనకు వచ్చిన ఈ కళ్లజోడును ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి బ్రిస్టోల్ ఆక్షన్స్‌కు పంపించాడు. గతంలో గాంధీకి చెందిన వస్తువులు వేలం వేయగా భారీ ధర పలికిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు