ముంబైలో భవనం కూలి 8 మంది మృతి

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (08:13 IST)
ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. భివాండిలో సోమవారం ఉదయం మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు.

శిధిలాల కింద నుండి ఐదుగురిని రక్షించామని, మరో 20మందికి పైగా చిక్కుకుపోయి ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు. 

సమాచారం అందుకున్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు