ఎనిమిదేళ్ల బాలికపై రిక్షావాలా అత్యాచారం.. వరండాలో నిద్రపోతున్న బాలికను..?

మంగళవారం, 28 జులై 2020 (13:32 IST)
ఢిల్లీలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఓ రిక్షా లాగేవాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల సుదామా ఫ్యామిలీతో కలిసి వుంటున్నాడు. అతడు రిక్షా నడిపేవాడు. సుదామాకు రాత్రి కాగానే... నోట్లో మందు చుక్క పడకపోతే నిద్ర పట్టదు. 
 
తాగుడుకు బాగా బానిసయ్యాడు. అలా శుక్రవారం రాత్రిడ మందు తాగి.. నిద్రపట్టకపోవడంతో అటూ ఇటూ తిరిగాడు. అలా తిరుగుతుండగా.. ఓ మరాఠా ఫ్యామిలీకి చెందిన ఓ ముసలామె, తన 8 ఏళ్ల మనవరాలు ఇద్దరూ ఇంటి బయట వరండాలో నిద్రపోతున్న దృశ్యం కనిపించింది. 
 
అంతే సుదామా ఆ చిన్నారి వద్దకు వెళ్లి నోరు మూసేసి.. ఆ పాప ఎంత గింజుకుంటున్నా మద్యం మత్తులో ఉండి కూడా వదల్లేదు. తెల్లారే సరికి ముసలామె నిద్రలేచి చూస్తే పాప పక్కన లేకపోవడంతో ఇళ్లంతా వెతికింది. 
 
చివరికి రోడ్డుపై బాలిక పడివుండటాన్ని చూసి.. ఏడుస్తున్న చిన్నారిని హడావుడిగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తస్రావం జరుగుతూ వున్న చిన్నారికి చికిత్స చేసిన డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలికపై అత్యాచారానికి  పాల్పడిన కామాంధుడిని అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు