అయ్యప్ప యాత్రకు శునకం : స్వాముల వెంట 480 కి.మీ. నడక

మంగళవారం, 19 నవంబరు 2019 (10:46 IST)
ఆ శునకాకి భక్తి ఎక్కువైనట్టుంది. దీంతో అయ్యప్ప స్వాములు శబరిమల క్షేత్రానికి కాలినడకన బయలుదేరగా వారితో పాటు.. ఆ శునకం కూడా బయలుదేరింది. అలా ఏకంగా 480 కిలోమీటర్ల నడకసాగిచి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికిగురిచేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి 13 మందితో కూడిన అయ్యప్ప భక్తుల బృందం గత అక్టోబరు నెల 31వ తేదీన శబరిమల పుణ్యక్షేత్రానికి కాలినడకన బయలుదేరారు. వారు బయలుదేరిన ప్రాంతం నుంచే ఓ శునకం వారిని అనుసరించసాగింది. 
 
తొలుత వారు దాన్ని గమనించలేదు. ఆ తర్వాత దాన్ని గుర్తించిన అయ్యప్పలు.. అప్పటి నుంచి తమ భోజనంలో దానికి కూడా కొంత పెడుతూ వచ్చారు. శునకానికి ఒక కాలికి గాయం అయినప్పటికీ అది ఇప్పటివరకు అయ్యప్ప భక్తులతో కలిసి 480 కి.మీ.కుపైగా నడకసాగించింది. ఈ శునకానికి అయ్యప్పస్వామిపై ఉన్న భక్తిని చూసి ఏకంగా అయ్యప్ప స్వాములో విస్తుపోతున్నారు. 

 

#WATCH Karnataka: A stray dog has been following a group of 13 Ayyappa devotees, who are on a pilgrimage to Kerala's Sabarimala & has walked 480 km so far. The devotees started from Andhra Pradesh's Tirumala on Oct 31 & have reached Chikkamagaluru dist's Kottigehara now. (17.11) pic.twitter.com/9ke8uFwRCt

— ANI (@ANI) November 18, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు