కేరళలో జూనోటిక్ వ్యాధి.. దోమకాటుతో జాగ్రత్త..

సెల్వి

బుధవారం, 8 మే 2024 (22:33 IST)
రాష్ట్రంలోని త్రిసూర్, మలప్పురం, కోజికోడ్.. మూడు జిల్లాల నుండి జూనోటిక్ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదు కంటే కేసులు నమోదైనాయి. వెస్ట్ నైల్ జ్వరం కేరళలో తాజా ఆందోళనలను లేవనెత్తింది. వెస్ట్ నైలు జ్వరం అనేది సోకిన దోమ కాటు ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది సోకిన పక్షుల నుండి వైరస్‌ను పొందుతుంది. 
 
రాష్ట్రంలో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని, అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో ధృవీకరించారు. జ్వరం లేదా వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ ఇతర లక్షణాలను చూపే ఎవరైనా వెంటనే చికిత్స పొందాలని ఆమె అభ్యర్థించింది.
 
2011లో కేరళలో తొలిసారిగా గుర్తించిన ఈ వ్యాధి 2019లో ఆరేళ్ల బాలుడు, 2022లో 47 ఏళ్ల వ్యక్తిని బలిగొంది. చాలామంది వ్యక్తులు వ్యాధి నుండి లక్షణాలతో ఇబ్బంది పడనప్పటికీ, కొందరు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు లేదా కొన్ని సందర్భాల్లో గొంతు నొప్పి వంటి తేలికపాటి లక్షణాలను అనుభవించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు