బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా భార్య కారు చోరీ!!

వరుణ్

సోమవారం, 25 మార్చి 2024 (09:14 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు ఢిల్లీలో చోరీకి గురైంది. ఢిల్లీలోని ఓ సర్వీస్ సెంటర్ నుంచి ఈ ఎస్‌యూవీ కారు మాయమైంది. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. కేసు నమోదు చేసి కారు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. నడ్డా భార్య పేరిట ఉన్న టాటా ఫార్చునర్‌ను ఈ నెల 19వ తేదీన కారు డ్రైవర్ గోవింద్‌పురిలోని ఓ సర్వీస్ సెంటరులో సర్వీసింగ్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అతడు తిరిగి వచ్చేలోపు కారు కనిపించలేదు. దీనిపై కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి పోలీసులు రంగంలోకి దిగారు. 
 
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కారు ఎటు వెళ్లిందో ఆచూకీ గుర్తించారు. ఈ కారు చివరిసారిగా గురుగ్రామ్ వైపు వెళ్లినట్టు తెలుసుకున్నారు. అయితే, కారు జాడను మాత్రం ఇంకా కనిపెట్టలేదు. ఇందుకోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తునట్టు వెల్లిడించారు. త్వరలోనే కారుతో పాటు.. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కారు నడ్డా సతీమణి పేరు మీద హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టరైనట్టు తెలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు